గౌరావనీయులైన సంఘ సభ్యులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు
శ్రీ గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరుపున అందరికి హృదయ పూర్వక అభివందనాలు.
శ్రీ గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం 2006వ సంవత్సరమున స్థాపించబడినది, 13 సంవత్సరముల ఆత్మీయ అనుబంధం, 200 + సభ్యుల కుటుంబం ప్రతీ ఏటా తప్పక జరుపుకునే కార్యక్రమములు
- కార్తీకమాసంలో కార్తీక వన సమారాధన
- నూతన సంవత్సర పంచాంగముల వితరణ
- ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం
- జంధ్యాల పూర్ణిమికి జంధ్యాల వితరణ
- సమయానుకూలంగా లక్షబిల్వార్చన
- శ్రీ వేంకటేశ్వర కల్యాణ నిర్వాహణ
- ఇంటింటా గాయత్రీ - ప్రతీ ఇంటా సమిష్ఠిగా సహస్ర గాయత్రీ మంత్ర జపం
- ఇంటింటా లలితా - ప్రతీ ఇంటా సమిష్ఠిగా లలితాసహస్ర నామ పారాయణ,
- నారాయణ సేవ
- శ్రీ సూక్త, పురుష సూక్త నిత్యా పూజా విధానం మరియు సంధ్యా వందన శిక్షణా తరగతులు,
- మంత్ర పుష్పం, రుద్ర నమకం మరియు చమకం వంటి శిక్షణా తరగతులు,
- నోములు, వ్రతాలలో సహకారము
- సంఘ సభ్యులకు వృత్తి పరమైన సలహాలు మరియు సహకారము,
- బీద బ్రాహ్మణులకు విద్య మరియు వైధ్యం కొరకు ఆర్ధిక సహాయం,
- బీద బ్రాహ్మణ వితంతువులకు ఆదాయ ఉత్పత్తికీ సహకారం.
- విద్యలో ప్రతిభావంతులకు పురస్కరములు,
- బీదలకు దుస్తుల పంపిణి,
- సామాజిక భవనము - కార్యక్రమ నిర్వహణ వేదిక సదుపాయము,
- 250 మందికి వండి, వడ్డించుటకు సరిపడే వంట పాత్రలు వాడుకునే సదుపాయం,
- బ్రాహ్మణ వివాహ వేదిక,
- మరియు అనేక నోములు వ్రతాలు నిర్వహిచుచున్నది.
- అత్యవసర సమయాల్లో రక్త దాతల వివరాలు మరియు రక్త దాన ఏర్పాటు,
- శుభ మరియు అశుభ కార్యక్రమంలో చేయుత.